శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత సంచారం. భక్తుల్లో ఆందోళన.

​తిరుమల:
తిరుమల శ్రీవారిమెట్టు నడకమార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. శుక్రవారం తెల్లవారుజామున మార్గంలోని 400వ మెట్టు వద్ద చిరుతను గమనించిన భక్తులు వెంటనే టీటీడీ సిబ్బందికి సమాచారం అందించారు.
​దీంతో అప్రమత్తమైన అధికారులు భక్తుల రక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. భక్తులను ఒంటరిగా అనుమతించకుండా, గుంపులు గుంపులుగా పంపిస్తూ నిరంతరం నిఘా ఉంచుతున్నారు. నడకమార్గంలో వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Related posts

సబ్ హెడ్: జి.ఓ. 36 అమలు చేయాలని డిమాండ్.. 2011 నుండి డివిడెండ్ చెల్లింపులపై పోరు.

పదవ తరగతి విద్యార్థులకు ‘దివీస్’ భరోసా: రూ. 8.50 లక్షల స్టడీ మెటీరియల్ పంపిణీ

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్?